మూత్ర సంబంధిత సమస్యతో బాధ పడుతోన్న ఓ వృద్దుడు.. ఆ బాధ భరించలేక, దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా తన మర్మాంగాన్నే కోసేసుకున్నాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. 75 ఏళ్ళ ఓ వృద్దుడు చాలాకాలంగా మూత్ర సంబంధిత సమస్యలతో సతమతం అవుతున్నాడు. చాలామంది స్పెషలిస్ట్ డాక్టర్ల వద్దకు వెళ్ళాడు. అయినా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ఈ వ్యాధి నయం చేసుకోవడానికి వేలకు వేలు ఖర్చు చేశాడు. అయినా ఫలితం మాత్రం శూన్యం.
దీనికి తోడు బాధ రోజురోజుకీ ఎక్కువైపోతోంది. ఈ నరకాన్ని తట్టుకోలేక కత్తితో తన మర్మాంగాన్ని కోసేసుకున్నాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో, వెంటనే కుటుంబీకులు అతనిని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్ళారు. ప్రస్తుతం దమోహా జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడా వృద్దుడు. ఎందుకిలా చేశావని అడిగితే.. ఈ బాధను తట్టుకోలేక పోయానని అందుకే ఇలా చేశానని, తాను చేసిన పనికి తాను బాధ పడడం లేదని సమర్ధించుకోవడం కొసమెరుపు.
ఇవి కూడా చదవండి..