ఉద్యోగుల భార్యలకు కూడా జీతాలిచ్చే కంపెనీ ఉంటుందా.. ? ఇంటిపని , వంటపని చేసుకునే ఉద్యోగుల భార్యలకు జీతాలేమిటని అనుకోవద్దు.. ఇప్పుడు ఏరిస్ గ్రూప్ కంపెనీ అదేపనిలో ఉంది. తమ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులబార్యలకు కూడా జీతాలిచ్చే పనిలో పడింది.
ఇంతకీ ఈ కంపెనీ యజమాని ఎవరో తెలుసా ..?
ఉద్యోగుల సీనియారిటీని బట్టి , వాళ్ళ భార్యలకు జీతాలు నిర్ణయిస్తారు. ఇంతకీ ఈ కంపెనీ యజమాని ఎవరో తెలుసా ..? కేరళకు చెందిన ప్రవాస భారతీయుడు సోహాన్ రాయ్ . గల్ఫ్ దేశాలలో ఎరియస్ కంపెనీ చాలా ప్రముఖమైనది. మనదేశంలోనూ ఆ కంపెనీకి పరిశ్రమలు ఉన్నాయి. కోవిద్ విజృంభణ సమయంలో ప్రపంచంలో అనేక కంపెనీలు ఉద్యోగులను తీసెయ్యడం , ఉన్నవారికి జీతాలు తగ్గించడం చేస్తే , ఎరియస్ కంపెనీ మాత్రం ఒక్క ఉద్యోగిని తీయలేదు. ఎవరికీ జీతాల్లో కోట విధించలేదు.
ఉద్యోగుల భార్యల కష్టం కూడా గుర్తించాలని
మన దేశంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఒక తీర్పు ఉద్యోగుల భార్యలకు కూడా జీతాలివ్వాలన్న తన నిర్ణయానికి కారణమని సోహాన్ రాయ్ చెబుతున్నారు. ఉద్యోగుల కష్టంవల్ల సంస్థలు ఎదగడంవెనుక , ఉద్యోగుల భార్యల కష్టం కూడా గుర్తించాలని కోర్టు ఇచ్చిన తీర్పు స్పూర్తితో తాను ఉద్యోగుల బార్యలకూ జీతాలివ్వాలని నిర్ణయించానని చెప్పారు.
ఇవీ చదవండి:
భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..
ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??
ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..
ఇదికూడా చదవండి..
https://ndnnews.in/121bulletbikeforbelletfood/