ప్రియుడిపై యాసిడ్ పోసి చంపేసింది..

    0
    216

    యాసిడ్ దాడులు అబ్బాయిలు, అమ్మాయిలపై చేసే కాలం పోయినట్టుంది. ఇటీవల కాలంలో ప్రేమించి మోసం చేసే అబ్బాయిలపైనే అమ్మాయిల యాసిడ్ దాడులు ఎక్కువవుతున్నాయి. తాజాగా ఆగ్రాలో సోనమ్ అనే ఓ అమ్మాయి తన ప్రియుడిపై యాసిడ్ దాడి చేసింది. ఆ ప్రియుడిని ఇంటికి పిలిచి మరీ యాసిడ్ పోసింది. ఈ దుర్ఘటనలో దేవేందర్ రాజ్ పుత్ అనే 28ఏళ్ల ప్రియుడు చనిపోయాడు. ఒక ప్రైవేట్ ల్యాబ్ లో పనిచేస్తున్న వారిద్దరూ గతంలో ప్రేమలో పడ్డారు.

    అయితే దేవేందర్ కి వేరే సంబంధం ఖరారు చేసి పెళ్లి చేయాలని అతని తల్లిదండ్రులు నిశ్చయించుకున్నారు. ఈ విషయం తెలిసిన ప్రియురాలు సోనమ్, తనని మోసం చేయొద్దంటూ దేవేందర్ ని కోరింది. అయితే పెద్దలు చెప్పిన సంబంధమే చేసుకుంటానని దేవేందర్ తేల్చి చెప్పాడు.

    దీంతో సోనమ్ కొంతకాలంపాటు ప్రియుడితో బాగానే ఉండి, ఆ తర్వాత తన ఇంట్లో ఫ్యాన్ పనిచేయడంలేదని, వచ్చి చూడాలని కోరింది. దేవేందర్ ఇంటికి రావడంతో కాఫీ ఇస్తానని కూర్చోబెట్టి సీసాలో యాసిడ్ తెచ్చి అతనిపై పోసింది. తీవ్రంగా గాయపడిన దేవేందర్ ఆస్పత్రిలో చనిపోయాడు. యాసిడ్ పోయడంలో సోనమ్ పై కూడా కొంత పడటంతో ఆమె గాయపడింది. సోనమ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

    ఇవీ చదవండి

    బట్టనెత్తి కనపడితే ఇంత గొడవా – భలే భలే

    పార్కుల్లో ప్రేమ జంటలే వాడి టార్గెట్.

    నగ్నంగా పోజులిస్తారు- బెడిసికొడితే??

    బుసలు కొట్టే కోడెనాగుపై ఆయన చేయి పడితే అంతే..