నక్సల్స్ చెరలో బందీగా ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్ రాకేశ్వర్ సింగ్ మన్హాస్ ను విడుదల చేశారు. బస్తర్ జిల్లా కలెక్టర్ కు, ఎస్పీకి ఈమేరకు సమాచారం అందింది. సామాజిక కార్యకర్త ధర్మపాలా శైనీ గోండ్వానా సమాజ్ అధ్యక్షుడు ఒరియా, వందలాదిమంది గ్రామస్తుల సమక్షంలో రాకేశ్వర్ సింగ్ ని అప్పగించారు. 11మంది సభ్యలు బృందం రాకేశ్వర్ సింగ్ విడుదలకోసం నక్సలైట్లతో చర్చలు జరిపింది. ఇందులో ఏడుగురు జర్నలిస్ట్ లు కూడా ఉన్నారు. సుకుమా రేంజ్ లోని టర్రెం క్యాంప్ కు రాకేశ్వర్ సింగ్ ను తీసుకొచ్చారు. ఈ ప్రాంతంలోనే ఎన్ కౌంటర్ జరిగింది.