దేశంలోనే అతి పెద్ద కార్ల కంపెనీ మారుతీ సుజుకీ తన మోడళ్ల ధరలను ఏప్రిల్ నుంచి పెంచబోతోంది. సగటున మోడల్ ని బట్టి 34 వేర రూపాయల వరకు ఈ పెరుగుదల ఉంటుందని తెలుస్తోంది. ఉత్పాదకత ఖర్చులు పెరిగిపోవడంతో కార్ల ధర పెంచక తప్పడంలేదని పేర్కొంది.
ఏ మోడల్ ధర ఎంత పెంచుతున్నారన్న విషయం ఇప్పుడే స్పష్టం చేయకపోయినా, ఈ నెలాఖరుకల్లా ఆ విషయంలో ఒక ప్రకటన చేస్తుంది. ధర పెంచడం మాత్రం ఖాయమని చెప్పేసింది. మారుతీ కంపెనీయే కాకుండా ఇతర కంపెనీలు కూడా తమ కార్ల ధరలను పెంచేందుకు నిర్ణయించుకున్నట్టు ఆటో మొబైల్ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కరోనా ఎఫెక్ట్ నుంచి చాలా వరకు కార్ల పరిశ్రమ ఆరోగ్యవంతంగా కోలుకుంది.