కామం ఆమె కళ్లుమూసింది..పాపం చేసింది.

    0
    2489

    కామోన్మాదంతో ఏడు మంది కుటుంబ సభ్యులను చంపిన షబ్నమ్ అసలు చరిత్ర ఏమిటో తెలుసా..? వింటే మీరు ఆశ్చర్యపోతారు. షబ్నమ్ కుటుంబం వాళ్ళ గ్రామంలో పెద్ద రైతుకుటుంబమే. 30 ఎకరాల పొలం , ఒక మేడ ఉంది. షబ్నమ్ ఎంఏ వరకు చదివింది. తరువాత ఎంఫిల్ చేసింది.గ్రామంలోనే టీచర్ గా పనిచేసేది. తండ్రి కూడా టీచర్. ఊళ్ళో గౌరవమైన కుటుంబం.

    https://ndnnews.in/seperatedeathrowforwomen1273-2/

    ఖర్మ కాలి , ఆరో తరగతితో చదువు ఆపేసిన సలీంతో పరిచయం ప్రేమగా మారింది. తరువాత శారీరిక సంబంధం ఏర్పరుచుకుంది. ఇద్దరు రెండు వేరువేరు తెగలకు చెందినవారు. దీనికితోడు కార్పెంటర్ గా కూలీ పనులకు పోయే సలీంతో సంబంధంపై కుటుంబం భగ్గుమంది. ఆమెను బయటకు పోనీయకుండా కట్టడి చేసింది. 2018 ఏప్రిల్ 14 వతేది , ఇద్దరూ పలుదఫాలు 60 నిముషాలు ఫోన్లో మాట్లాడుకొని సామూహిక హత్యలకు ప్లాన్ చేశారు.

    https://ndnnews.in/dog-raped-by-a-teenager-in-karnataka/

    షబ్నమ్ కుటుంబ సభ్యులకు పాలలో మత్తుమందు కలిపి ఇచ్చింది. రాత్రి అందరూ నిద్రపోయిన తరువాత , ఒంటిగంటకు సలీంకు ఫోన్ చేసి , వెనుక తలుపు తీసి ఇంట్లోకి రమ్మంది. తానే బలవంతం చేసి , తల్లి , తండ్రిని మొదట చంపించింది. తరువాత 10 నెలలబిడ్డని , అక్కాచెల్లెళ్లను చంపించింది. అందరినీ కత్తులు , గొడ్డళ్లతో నరికారు. తరువాత సలీంని పంపేసి , మేడపైకి ఎక్కి ఇంట్లో దొంగలు పడ్డారని , అందరినీ కొట్టేశారని అరిచి గోలచేసింది. అయితే నేరం జరిగిన తీరుచూసిన పోలీసులు , పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తరువాత అనుమానంతో షబ్నమ్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా , దారుణం బయటపడింది.

    https://youtu.be/h-uCcJc9B10