షబ్నమ్ కోసం ప్రత్యేక ఉరి కంభం ఉంది.. అదెక్కడో తెలుసా…?

    0
    1295

    మన దేశంలో మహిళలను ఉరితీసేందుకు ఒక ప్రత్యేకమైన ఉరికంబం ఉందని చాలామందికి తెలియదు. అక్కడ మహిళా ఖైదీలనుమాత్రమే ఉరితీస్తారు. ఉత్తరప్రదేశ్ లోని మధుర లో ఆ జైలు 1872 లో నిర్మించిన ఈ జైలులో , మహిళా ఖైదీలను ఉరి తీసేందుకు ప్రత్యేకమైన గది ఉంది. అందులో ఉరికంబం , ఉరితాడు బిగించి లాగే ఇనుప లివర్ ఉన్నాయి.

    https://ndnnews.in/dog-raped-by-a-teenager-in-karnataka/

    అంరోహ జిల్లాలో కామోన్మాదంతో ఏడుగురు కుటుంబసభ్యులను చంపిన నీచురాలు షబ్నమ్ ను ఇక్కడే ఉరితీయనున్నారు. అయితే ఇంతవరకు ఆ గది కట్టినతరువాత అక్కడ ఖైదీ మహిళలు ఎవరినీ ఉరితీయలేదు. బ్రిటిష్ కాలంలో ఒక మహిళను ఉరితీసిన తరువాత , ఉరిశిక్ష పడ్డ మహిళలకోసం ఈ గది కట్టారు. అయితే 1872 నుంచి ఈ గదిలో ఇంతవరకు ఉరి తీత జరగలేదు. అందువల్ల ఈ గది గురించి ఎవరూ పట్టించుకోలేదు.

     

    https://ndnnews.in/interesting-factsaboutindianssexual-life/

    పైకప్పు కూలిపోయింది. గోడలు పడిపోయి , పిచ్చిమొక్కలు ఉన్నాయి. ఉరికంబం , తాడు లాగే లివర్ తుప్పుపట్టిపోయి ఉన్నాయి. ఇప్పడు షబ్నమ్ ను ఉరి తియ్యాలంటే ఈ గదిని మరమ్మతు చెయ్యాలి. తుప్పుపట్టిపోయిన ఉరికంబాన్నికూడా మార్చాలని జైలు అధికారులు నివేదిక ఇచ్చారు..

     

    https://www.youtube.com/watch?v=UHmMvOXDi4g