అత్తకు ప్రియుడు , మామకు యముడు.

    0
    877

    మేనల్లుడని దగ్గరకు తీస్తే , అత్తకి ప్రియుడయ్యాడు.. చివరకు మామనే చంపేశాడు.. జోగులాంబ గద్వాల్ జిల్లాలో జరిగిన దారుణం ఇది. థరూర్ మండలం దారవీడు గ్రామంలో భార్య , మేనల్లుడు కలిసి రంగారెడ్డి అనే వ్యక్తిని చంపేశారు. రంగారెడ్డికి భార్య చనిపోవడంతో , రెండో పెళ్లి చేసుకున్నాడు. అక్క కొడుకునికూడా తన దగ్గరే ఉంచుకున్నాడు. మేనల్లుడుకదా అని నమ్మేశాడు. అయితే రెండో భార్య , మేనల్లుడుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇది పసిగట్టిన రంగారెడ్డి , భార్యను , మేనల్లుడిని మందలించాడు. మేనల్లుడిని ఇంటికి రావద్దని చెప్పేశాడు. దీంతో ఇద్దరూ కలిసి రంగారెడ్డిని చంపాలని నిర్ణయించుకున్నారు. మద్యంతాగి ఇంటికొచ్చిన భర్త సంగతి భార్య , మేనల్లుడికి చెప్పింది. దీంతో ఇద్దరూ కలిసి రంగారెడ్డిని గొడ్డలితో నరికి చంపేశారు. తర్వాత శవాన్ని ఏమిచేయాలో తెలియక ఇంట్లోనే పెట్టేశారు. ఇరుగుపొరుగు ఈ విషయం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిద్దరిని అరెస్ట్ చేశారు.

     

    ఇవీ చదవండి

    క్షుద్ర పూజలకు అమ్మాయిల అండర్ వేర్లు..

    భార్యల మార్పిడి విషవలయంలో సమిధలు ..

    బాలుడిని లేపుకుపోయిన ముగ్గురు బిడ్డల తల్లి.

    భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..