గుంటూరు పిడుగురాళ్ళలో బిజెపి ర్యాలీ

    0
    106

    గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలో బిజెపి జిల్లా కార్యదర్శి శశికుమార్ ఆద్వర్యంలో జైశ్రీరామ్ అనే నినాదంతో ర్యాలీ

    రామతీర్థానికి బయలుదేరిన ప్రజావ్యతిరేక నాయకులకు లేని నిబంధనలు నేడు బిజెపి,జనసేనలకే వర్తింపచేయటం అధికారపార్టీ వైఖరి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారిందని నిప్పులు చెరిగిన జిల్లా ప్రధాన కార్యదర్శి యేలూరి శశి కుమార్

    గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలో బిజెపి జిల్లా కార్యదర్శి శశికుమార్ ఆద్వర్యంలో జైశ్రీరామ్ అనే నినాదంతో ర్యాలీ నిర్వహించి రామతీర్థంలో సోము వీర్రాజుపై జరిగిన రావణకాండకు నిరసనగా జనసేన,బిజెపి నాయకులు పట్టణంలో ధర్నా చేపట్టారు,ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పోటాపోటీగా రామతీర్థానికి బయలుదేరిన ప్రజావ్యతిరేక నాయకులకు లేని నిబంధనలు నేడు బిజెపి,జనసేనలకే వర్తింపచేయటం అధికారపార్టీ వైఖరి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారిందని నిప్పులు చెరిగారు,దేవాలయాలలోని దేవతా విగ్రహాలపై దాడులను ఖండించే దిశగా పనిచేయాల్సిన అధికారపార్టీ మంత్రులు అవహేళనగా మొండి వైఖరిని ప్రదర్శిస్తుందని టిడిపి హయంలో 40 దేవాలయాలను ద్వంసం చేస్తే ప్రస్తుత ప్రభుత్వంలో 160 దేవదేతలపై దాడులు జరగడం మతాల మద్య చిచ్చు రేపే ధోరణి కనబరుస్తున్నారని,ప్రపంచంలో ఏపార్టీ గెలవాలన్నా ఒక కులమో,ఒక మతం వారో ఓటు వేస్తే గెలవలేరని అన్ని కులమతాలు ఏకమై మద్దతిస్తేనే రాజకీయానికి మనుగడ ఉంటుందని జనసైనికులు ద్వజమెత్తారు,అదేవిధంగా బిజెపి నాయకులు సోము వీర్రాజును అక్రమంగా అరెస్ట్ చేయటం అధికార పార్టీ అహంకారానికి నిదర్శనమని అక్రమ అరెస్టులను ఆపకపోతే రానున్న రోజుల్లో బిజెపి,జనసేనలు ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యేలూరి శశి కుమార్,రాష్ట్ర ఈసి నంబర్ పురుగుల రవి శంకర్,జిల్లా అధ్యక్షులు కర్ణ అమర సైదారావు,రూరల్ మండలం ఉపాధ్యక్షులు పూసల రాఘవేంద్ర,టౌన్ యువ మోర్చా అధ్యక్షులు వేముల జగదీష్,గురజాల మండల నాయకులు గుండా కాసి,బీజేపీ సీనియర్ నాయకులు బొడ్డు రామకృష్ణ,వెలుగురి రాధ,పట్టణ జనసేన నాయకులు కామిశెట్టి రమేష్,కిరణ్ కుమార్,బీజేపీ,జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు