అక్షయపాత్ర గురించి మనం సినిమాల్లోనే చూశాం ..కథల్లోనే విన్నాం.. అయితే ఇప్పుడు తెలంగాణాలో ఒక ఏటీఎం అక్షయపాత్ర అయిందట.. వంద రూపాయలు కావాలంటే వెయ్యిరూపాయలు, 500 అని కొడితే 2 వేలరూపాయలు, 2 వేలు కొడితే 4 వేలు ఇస్తుందట .. దీంతో జనం ఆ ఏటీఎం ముందు క్యూ కట్టేశారు.. తేరగ్గా డబ్బు వస్తుందంటే మనోళ్లు ఎగబడతారు కదా..? దీంతో పోలీసులకు అసలు విషయం తెలిసి , ఏటీఎం మూయించేసి , ఇండియన్ బ్యాంకు అధికారులకు ఇంటిమేషన్ ఇచ్చారు.. ఏటీఎంలో సాంకేతికలోపం వల్ల ఇలా జరిగిందని భావిస్తున్నారు.. వనపర్తి జిల్లా అమరచింతలో ఇలా జరిగింది..