నెల్లూరు జిల్లా కొండాపురం మండలం రామానుజపురం గ్రామంలో ఓ మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు అత్యాచారయత్నం చేశారు. పెరుగు ప్యాకెట్ కోసం దుకాణానికి వెళ్ళిన బాలికను బలవంతంగా అక్కడి నుంచి చెరువు గట్టుకు వద్దకు లాక్కెళ్ళారు. అయితే అదే సమయంలో ఓ వ్యక్తి బాలిక కేకలు విని, అక్కడికి రావడంతో నిందితులు పరారయ్యారు. చీకటిలో తనను చెరువు దగ్గరకు లాక్కుపోయి , చేతులు , కాళ్ళు కట్టేశారని , తన అరుపులు విని కొంతమంది వచ్చి రక్షించారని చెప్పింది. కుటుంబసభ్యులతో కలిసి బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రధాన నిందితుడు మార్కండేయులు అరెస్టు చేశామని, మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని ఎస్.ఐ మాల్యాద్రి తెలిపారు.