తాళి తెగింది..కడుపు మండింది..
బంగారు తెలంగాణా అంటూ గొప్పలు చెప్పుకుంటున్న తెలంగాణాలో అవినీతి మాత్రం అదుపులోకి రావడం లేదు. మరీ ముఖ్యంగా రెవెన్యూ శాఖలో అందినకాడికి దోచుకోవడం.. పని మీద వచ్చిన పేదలను పీల్చి పిప్పిచేయడం మనం చూస్తూనే ఉంటాం.. తాజాగా రాజన్నసిరిసిల్ల జిల్లా, రుద్రంగి మండలంలోనూ ఓ మహిళను ఇలాగే లంచం కోసం పీడించారు కొందరు రెవెన్యూ ఉద్యోగులు.. దీంతో కడుపు మండిన ఆ మహిళ, తహసిల్దార్ కార్యాలయ గుమ్మానికి తన మంగళ సూత్రాన్ని కట్టి, నిరసన తెలియజేసింది. రెవెన్యూ శాఖలో అవినీతి ఎంతలా పెరిగిపోయిందో తెలుసుకునేందుకు ఇదొక ఉదాహరణ..