ఓవైపు కరోనా వచ్చి ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుంటే.. మరోవైపు ఇలాంటి సిల్లీ రీజన్స్ తో కూడా ప్రాణాలు తీసుకునేవారు ఉంటారా అనిపిస్తుంది కొన్నిసార్లు. ఈ ఘటన తమిళనాడులోని కొడుంగయ్యూరులో జరిగింది. భర్త తమిళన్ ప్రసన్న డీఎంకే అధికార ప్రతినిధి. భార్య నదియా గృహిణి. ఇటీవల భార్య తన పుట్టినరోజు వేడుకల్ని గ్రాండ్ గా జరపాలని భర్తని కోరింది. అయితే కరోనా కాలంలో పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ వద్దని నచ్చజెప్పాడు. కానీ భార్య వినలేదు, మాటా మాటా పెరిగింది. గొడవ పెద్దదైంది. ఉన్నట్టుండి రూమ్ లోకి వెళ్లి గడియపెట్టేసుకుంది. కాసేపటి తర్వాత గడి తీస్తే.. భార్య ఉరేసుకుని చనిపోయింది.
అల్లుడిపై కేసు పెట్టిన మామ..
తన కుమార్తె నదియా ఆత్మహత్యకు అల్లుడు ప్రసన్న వ్యవహార శైలే కారణం అంటూ పోలీసులకు నదియా తండ్రి ఫిర్యాదు చేయడంతో, కొడుంగయ్యూరు పోలీసులు కేసు నమోదు చేసారు.