లవర్ మోసం చేస్తే ఏ అమ్మాయయినా ఏం చేస్తుంది. ప్రేమికుడి ఇంటికెళ్లి న్యాయం కావాలంటుంది. కొందమంది మౌనపోరాటాలు కూడా చేస్తుంటారు. ఇంటిముందే కూర్చుని న్యాయం జరిగే వరకు కదలనంటారు. కానీ ఈ అమ్మాయి మాత్రం అంతకు మించి అంటోంది. లవర్ కి చుక్కలు చూపెట్టింది.
ఇంతకీ ఏం జరిగింది…?
ఉత్తర ప్రదేశ్ గోరఖ్ పూర్ కి చెందిన సందీప్ మౌర్య అనే యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. రెండేళ్లుగా వీరు సాన్నిహిత్యంగా ఉంటున్నారు. సందీప్ తరచుగా ఆ యువతి ఇంటికి వస్తుండేవాడు. ఈ క్రమంలో, సందీప్ కు ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి ఆ యువతిని పట్టించుకోవడం లేదు. కాగా, సందీప్కు అతని కుటుంబ సభ్యులు, వేరే అమ్మాయితో వివాహం చేయడానికి సిద్ధపడ్డారు. ఈ విషయం ఆ యువతికి తెలిసింది.
వెంటనే, ఆమె ‘పెళ్లి బాజా, భజంత్రీలు, బరాత్.. తన మిత్రులు, బంధువులతో కలిసి ప్రియుడి ఇంటి ముందుకు చేరుకుంది. అంతటితో ఆగకుండా తనను పెళ్లి చేసుకోవాలంటూ బ్యాండ్ వాయిస్తు రచ్చ చేసింది. దీంతో అక్కడ కొద్దిసేపు గందర గోళ పరిస్థితి ఏర్పడింది. కాసేపటికి రంగంలోకి దిగిన పోలీసులు యువతిని సముదాయించడానికి ప్రయత్నించారు. ఆమె మాత్రం అక్కడి నుంచి వెళ్లనని భీష్మీంచుకుని కూర్చుంది.
‘తాను, ఆ యువకుడినే పెళ్లి చేసుకుంటానని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని తెగేసి’ చెప్పింది. తనను.. ప్రేమ పేరుతో శారీరకంగా కూడా వాడుకుని .. ఇప్పుడిలా మోసం చేస్తున్నాడని పోలీసుల ఎదుట కన్నీటి పర్యంత మయ్యింది. అయితే, పోలీసులు కాసేపటి తర్వాత ఆ యువతిని ఆమె ఇంటికి తరలించారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు లవర్ ని అదుపులోకి తీసుకున్నారు.