ప్రభుత్వ స్కూళ్ళను ఆదర్శంగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులు ఎంతోమంది ఉన్నారు. కానీ కొంతమంది ఉపాధ్యాయులు మాత్రం… జీతం తీసుకోవడానికే వస్తుంటారు. పిల్లలకు పాఠాలు చెప్పకుండా క్లాసు రూములో నిద్రలో జోగుతుంటారు. అలాంటి వారిలో ఈ టీచర్ కూడా ఒకరు. బీహార్ రాష్ట్రంలో బాగీపూర్ణియా గ్రామంలో ఈ లేడీ టీచర్ చేస్తోన్న నిర్వాకమే ఇందుకు ఉదాహరణ.
విద్యార్ధులకు పాఠాలు చెప్పకుండా క్లాసు రూములో హాయిగా నిద్రపోతోంది. ఓ స్టూడెంట్ కు విసరకర్ర ఇచ్చి ఊపమని ఆర్డర్ వేసి మరీ నిద్ర పోతోంది. చదువుకోడానికి వచ్చిన ఆ విద్యార్ధితో ఇలా సేవలు చేయించుకుంటోంది. ఇలాంటి దృశ్యాలు ఉన్నతాధికారులైనా చూస్తారో లేదో… నిద్ర పోతున్న ఆ టీచర్పై కనీసం క్రమశిక్షణా చర్యలైనా తీసుకుంటారో లేదో చూడాలి.
View this post on Instagram