రఘురామ కృష్ణంరాజు కాలి వేలికి గాయం నిజమే..

    0
    44

    ఎంపీ రఘురామకృష్ణంరాజుకి సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి వైద్యులు చేసిన పరీక్షల్లో ఆయన కాలి వేలికి గాయం అయిందన్న విషయం రుజువైంది. ఈమేరకు వైద్యులు పంపిన నివేదికను సుప్రీంకోర్టు న్యాయమూర్తి వినీత్ శరన్ పరిశీలించారు. వైద్య పరీక్షల నివేదికను చూసిన ఆయన, ముగ్గురు వైద్యులు పరీక్షించి ఎక్స్‌రే, వీడియో కూడా పంపారని తెలిపారు. రఘురామకృష్ణంరాజుకు జనరల్‌ ఎడిమా ఉందని.. కాలి వేలికి ఫ్రాక్చర్‌తో పాటు మరికొన్ని గాయాలు ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారని జస్టిస్‌ వినీత్‌ శరన్‌ అన్నారు. వైద్య పరీక్షల నివేదికను ఏపీ ప్రభుత్వం, న్యాయవాదులకు మెయిల్ చేస్తామని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను మధ్యాహ్నం 2.30గంటలకు వాయిదా వేసింది.

    ఇవీ చదవండి..

    ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

    వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

    కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

    రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు