కడప జిల్లాలో ఘోరం జరిగింది.. 11 ఏళ్ల జమీర్ అనే పిల్లాడు కత్తితో ఏకంగా తల్లినే చంపేశాడు. నమ్మశక్యం కాని ఈ నిజం.. కడపజిల్లాలోని నకాష్ వీధిలో జరిగింది. పోలీసులు తల్లిని చంపిన ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. తల్లికి 14 ఏళ్ల కూతురుకి మధ్యన ముందురోజు రాత్రి గొడవ జరిగింది. ఫోన్ ఎక్కువగా చూస్తున్నావని తల్లి మందలించింది. దీంతో తల్లీ కూతుళ్ళ మధ్యన గొడవ జరిగింది. గొడవ ముదిరి కూతురిని చున్నీతో మెడకు బిగించి తల్లి చంపేసింది. అయితే ఇదంతా చూస్తున్న పదకొండేళ్ల కొడుకు ఆగ్రహంతో.. కత్తితో తల్లిపై దాడి చేశాడు. ఈ దాడిలో తల్లి కూడా మృతి చెందింది.