దేశంలో అమ్మాయిల వ్యాపారం మళ్ళీ జోరందుకుంది. ఇటీవలకాలంలో బంగ్లాదేశ్ నుంచి , సరిహద్దులమీదుగా అమ్మాయిల స్మగ్లింగ్ ఊపందుకుంది. ఇప్పుడు దేశంలో అన్నినగరాలలో బంగ్లాదేశ్ నుంచి అద్దెకు తెచ్చుకున్న అమ్మాయిలతోనే వ్యాపారం చేస్తున్నాడు. ఇటీవలకాలంలో బెంగుళూరు, ముంబయి, ఢిల్లీ , కలకత్తా , అహ్మదాబాద్ ..ఇలా పలు నగరాలలో తరుచుగా చేసే దాడులలో బంగ్లాదేశ్ అమ్మాయిలే ఎక్కువగా కనిపిస్తున్నారు. తాజాగా బంగ్లాదేశ్ అమ్మాయిలతో హైదరాబాదులో కూడా వ్యాపారం జోరుగా సాగుతుందని చెబుతున్నారు. తాజాగా పోలీసులు సనత్ నగర్ లో ఓ ఇంటిపై జరిపిన దాడిలో ఆరుగురు అమ్మాయిలు పట్టుబడ్డారు. వీరిని వ్యబిచారంకోసమే బంగ్లాదేశ్ నుంచి రప్పించారు.