రోడ్డుపై గుంతలు కనపడితే ఎవరైనా ఏంచేస్తారు. ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ ముందెకళ్తారు, మరోసారి అదే దారిలో వెళ్తే, ఆ గుంతని తప్పించుకుని వెళ్లేందుకు ట్రై చేస్తారు. కానీ ఆ దంపతులు మాత్రం అక్కడితో ఆగిపోలేదు. ఆ గుంతల్ని పూడ్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు.
అవును
మేమిద్దరం ఇష్టపడ్డాము !మన నగరములో మాకు
కనిపించిన ప్రతి గుంతను పూడ్చాలని !!ఇప్పటివరకు 2 వేలకు పైగా
గుంతలు పూడ్చేము.So far they filled more than 2000 potholes
by spending their pension money.
Nation FirstSir & Madam garu ????
True Inspiration for the society pic.twitter.com/vfpZMzKIgZ— Alluri soujanya (@souji400) July 3, 2021
రిటైర్ అయిన తర్వాత వచ్చే తమ పింఛన్ డబ్బుల్ని ఇలా ఖర్చు పెడుతున్నారు ఈ ఆదర్శ దంపతులు. దీనికోసం ఓ ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రోడ్డుపై డైవర్షన్ బోర్డులు పెట్టి మరీ రిపేర్ వర్క్ లు మొదలు పెడతారు. ఆ పని పూర్తైన తర్వాతే అక్కడినుంచి వెళ్తారు.