ప్రియాంక పిలుపుతో 7 కోట్లు విరాళాలు..

    0
    37

    కరోనా సెకండ్‌ వేవ్‌ మరింత తీవ్రంగా ఉండటంతో ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరతతో ఇబ్బందులు పడుతున్న కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యంలో బాలీవుడ్ యాక్ట‌ర్ సోనూసూద్ ఎంద‌రికో ఆద‌ర్శం. ఇక తమ వంతుగా గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్‌తో కలిసి భారత్‌లోని కోవిడ్‌ బాధితుల కోసం నిధుల సేక‌ర‌ణ చేప‌ట్టింది. ఇప్పటి వరకు మిలియన్‌ డాలర్లు ఈ దంప‌తులు సేక‌రించారు. అంటే భార‌త క‌రెన్సీలో 7 కోట్ల‌కు పైమాటే. గివ్ ఇండియా ద్వారా ఈ నిధులను సేకరించారు. వీటితో ఆక్సీజ‌న్ కాన్స‌న్ ట్రేట‌ర్లు, ఆక్సీజ‌న్ సిలిండ‌ర్లతో పాటు క‌రోనా పేషంట్ల‌కు ఆహారం స‌ర‌ఫ‌రా వంటి కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్ట‌నున్నారు. ఇక ముందు కూడా ఇలాగే ఫండ్ రైజింగ్ చేప‌ట్టి, చిన్న‌పిల్ల‌ల‌కు పౌష్టికాహారం అందించేందుకు కృషి చేస్తామ‌ని ప్రియాంక దంప‌తులు చెబుతున్నారు.

    ఇవీ చదవండి..

    ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

    కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

    ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

    ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..