కొన్ని సందర్భాల్లో పోలీసులు స్పందించే తీరు ప్రశంసనీయంగా ఉంటుంది. ఉత్తర ప్రదేశ్ కౌసాంబి జిల్లాలోని నోయిడాలో 45ఏళ్ల వ్యక్తి ఉరేసుకున్నాడు. ఇంట్లో తలుపు గడియపెట్టుకుని ఆ వ్యక్తి ఉరేసుకోవడంతో, ప్లస్ 1 చదువుతున్న ఆ వ్యక్తి కూతురు ఎమర్జెన్సీ నెంబర్ 112 కి ఫోన్ చేసింది. దీంతో పోలీసులు వెంటేన స్పందించారు.
మధ్యాహ్నం 2గంటల 10నిముషాలకు కాల్ రిసీవ్ చేసుకున్న పోలీసులు 2గంటల 13నిముషాలకు.. అంటే మూడు నిముషాల్లో ఆ ఇంటికి చేరుకున్నారు. తలుపులు పగలగొట్టి ఆ వ్యక్తిని రక్షించారు. పోలీస్ జీబు వెళ్లేటప్పటికే ఆ వ్యక్తి ఉరికంగానికి వేలాడుతూ గిలగిలా కొట్టుకుంటున్నాడు. అతడిని పోలీసులు రక్షించి ఫస్ట్ ఎయిడ్ చేసి కాపాడారు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉంది. తాగిన మైకంలో అతను ఈ పని చేశాడు. ఆ సమయంలో అతని భార్య తగవు పడి పొలానికి వెళ్లింది. ఆవేశంలో అతను ఉరి వేసుకోగా కూతురు పోలీసులకు సమాచారమిచ్చింది.