రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ ఓ హోం గార్డు తల్లికి పాదాభివందనం చేశారు. ఈ దృశ్యాలకు సంబంధించని వీడియోను కమిషనరేట్ కార్యాలయం తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారి కుటుంబాలను మహేశ్ భగవత్ సత్కరించారు.
అంబర్పేట్ కార్ హెడ్ క్వార్టర్స్లో జరిగిన ఈ కార్యక్రమంలో హోంగార్డు లింగయ్య తల్లి సారమ్మ పాల్గొంది. ఈ నేపథ్యంలో ఆమెకు మహేశ్ భగవత్ పాదాభివందనం చేశారు. 2015లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆత్మకూర్ పరిధిలోని సిమీ ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు పోలీసులతో పాటు హోంగార్డు లింగయ్య అమరులయ్యారు.
#PoliceFlagDay celebrations have been held at CAR Hqrts, Amberpet and #RachakondaPolice paid floral tributes to the #PoliceMartyrs on 21st October.
“Police Martyrs immortal sacrifices are priceless. The nation will remember them forever” CP #Mahesh_Bhagwat_IPS. pic.twitter.com/pGyfwzaMh5
— Rachakonda Police (@RachakondaCop) October 21, 2021