ఆ పేదతల్లి పాదాలకు పోలీస్ కమీషనర్ పాదాభివందనం..

    0
    229

    రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌ర్ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ ఓ హోం గార్డు త‌ల్లికి పాదాభివంద‌నం చేశారు. ఈ  దృశ్యాల‌కు సంబంధించ‌ని వీడియోను క‌మిష‌న‌రేట్ కార్యాల‌యం త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. పోలీసు అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా వారి కుటుంబాల‌ను మ‌హేశ్ భ‌గ‌వ‌త్ స‌త్క‌రించారు.

    అంబ‌ర్‌పేట్ కార్ హెడ్ క్వార్ట‌ర్స్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో హోంగార్డు లింగ‌య్య త‌ల్లి సార‌మ్మ పాల్గొంది. ఈ నేప‌థ్యంలో ఆమెకు  మ‌హేశ్ భ‌గ‌వ‌త్ పాదాభివంద‌నం చేశారు. 2015లో ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా ఆత్మ‌కూర్ ప‌రిధిలోని సిమీ ఉగ్ర‌వాదుల‌తో జ‌రిగిన ఎదురు కాల్పుల్లో ఇద్ద‌రు పోలీసులతో పాటు  హోంగార్డు లింగ‌య్య అమ‌రుల‌య్యారు.

     

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..