ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు కంటతడిపెట్టడం తనను ఎంతో బాధపెట్టిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు.. తన భార్యను , కించపరిచారని , ఆమె గౌరవమర్యాదలకు భంగం కలిగేవిధంగా ప్రవర్తించారని , ప్రతిపక్ష నేత కంట తడిపెట్టడం మంచిది కాదన్నారు.. ఇలాంటి సంఘటనలు , సామాన్యులకు రాజకీయాలంటేనే అసహ్యం కలిగిస్తాయని చెప్పారు. మహిళల పట్ల ఎంతో గొరవభావంతో ఉండాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇది జనసేన పార్టీ విధానమని కూడా చెప్పారు. గతంలో జగన్ కుటుంబ సభ్యులను కొందరు కించపరిచారని అన్నప్పుడు కూడా తాను ఖండించానని చెప్పారు. రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలతో ప్రజలు అల్లాడుతుంటే , ఇలాంటి పనికిమాలిన పనులుఏమిటన్నారు. టీవీ చర్చల్లో కూడా ముహిళలపట్ల మర్యాదగా మాట్లాడటంలేదన్నారు.