సమాధి పిలిచింది.. హలో ..హలో అంటూ .. ఇదేదో సినిమా కథకాదు.. మన డిజిటల్ ఇండియాలో నిజమైన ఘటన.. అభివృద్ధి చెందిన , చెందుతున్న దేశాల్లో డిజిటల్ సేవలు అద్భుతంగా ఉంటే , అభివృద్ధి చెందిన దేశాలతో పోటీలో ఉన్నామంటూ చెప్పుకునే మన దేశంలో చెట్లు , పుట్టలు చివరకు సమాధులను కూడా మొబైల్ సిగ్నల్స్ కోసం ఆశ్రయించాల్సి వస్తుంది.. మహబూబాబాద్ జిల్లాలో కోయగూడెం గ్రామంలో విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులకోసం ఇలా సమాధి మీదనే ఉండాల్సి వస్తోంది.. ఈ ఊళ్ళో స్మశానంలోనే మొబైల్ సిగ్నల్స్ షుమారుగా వస్తాయి.. అందువల్ల నిద్రలేచిన మొదలు , రెడీ అయి , క్లాసులు వినేందుకు సమాదులపైకి రావాల్సిందే..
ఇవీ చదవండి..