మాజీ సీఎం ఎన్టీఆర్ నాలుగవ కుమార్తె అయిన ఉమామహేశ్వరి కన్నుమూశారు. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లోని నివాసంలో ఆమె మరణించారు. అయితే ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ 12 మంది సంతానంలో నలుగురు కూతుర్లు ఉన్నారు. వారిలో ఈమె నాలుగవ కుమార్తె.. ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ లో ఉన్న బాలయ్యకు ఈ విషయం తెలియజేశారు.
ఈ విషయం తెలియగానే చంద్రబాబు, భువనేశ్వరి, నారా లోకేష్, పురంధరేశ్వరి ఆమె నివాసానికి చేరుకున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్న ఉమామహేశ్వరి.. మానసిక ఒత్తిడి, అనారోగ్యం కారణంగా మరణించి ఉంటుందని చెబుతున్నారు. ఆమె మొదటి భర్త నరేంద్ర రాజన్ కు విడాకులు ఇచ్చిన అనంతరం.. కంఠమనేని శ్రీనివాస ప్రసాద్ ను రెండవ పెళ్లి చేసుకుంది. ఉమామహేశ్వరి మరణ వార్తతో నందమూరి కుటుంబం విషాదంలో మునిగిపోయింది.