విషం తీసుకోవడంవల్లనే పెళ్లికూతురు మృతి..

    0
    1663

    తాళికట్టే ముందు జీలకర్ర బెల్లం పెట్టే శుభవేళలో ఈ వధువుని మృత్యువు కాటేసింది.. ఈ కేసులో పోస్టుమార్టం తరువాత ట్విస్ట్ సెన్సేషన్ అయింది.. పెళ్లిపీటలపైకి రాకముందే అమ్మాయి స్లో పాయిజన్ తీసుకుందని తేలింది.. పెళ్లి ఇష్టంలేకనే ఆమె ఇలా చేసిందని తెలిసింది.

    అత్యంత విషాదమైన ఈ ఘటన విశాఖ సమీపంలోని మధురవాడలోని నగరం పాలెం ప్రాంతంలో జరిగింది. తాళి కట్టే సమయానికి కొద్దీ నిమిషాలముందు , పెళ్ళికొడుకు , పెళ్లికూతురు తలపై జీలకర్ర , బెల్లం పెడుతుండగా కుప్పకూలిపోయింది. క్షణంలోనే ప్రాణం విడిచింది. దీంతో పెళ్లి మండపం శోక మండపమైంది.

    గత రాత్రి వరుడు శివాజీ, వధువు సృజనల పెళ్లి అంగరంగ వైభవంగా మొదలయింది. పురోహితుడు మంత్రాలు వల్లిస్తూ , పెళ్ళికొడుకుని , అమ్మాయి తలపై జీలకర్ర బెల్లం పెట్టమన్నాడు.. రెండూ కలిపి ఇచ్చాడు. ఇంతలోనే అనుకోని విధంగా పెళ్లికూతురు పీటలపైనే కుప్పకూలిపోయింది.

    కదలకుండా ఉండిపోయిన సృజనను ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకొచ్చేప్పటికే ఆమె ప్రాణాలు పోయినట్టు డాక్టర్లు చెప్పారు. పోస్టుమార్టం రిపోర్ట్ లో పెళ్లికూతురు విషం తీసుకుందని తేలడంతో రెండు కుటుంబాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు..

     

    ఇవీ చదవండి… 

    బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

    మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

    ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

    ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.