రాష్ట్రంలో 26 జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. వచ్చేనెల ఏప్రిల్ రెండో తేదీ , ఉగాది నాటికి కొత్త జిల్లాల్లో కలెక్టర్లు కొలువు తీరనున్నారు. జిల్లాల ఏర్పాటుకు అవసరమైన పాలనాపరమైన కసరత్తుకూడా పూర్తయిపోయింది. నాలుగు జిల్లాలు మినహా , మిగిలిన తొమ్మిది కొత్త జిల్లాల్లో , ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన అన్ని భవన వసతులను సిద్ధం చేశారు. మిగిలిన వాటిని మరో వారంలో పూర్తిచేస్తారు. రెవెన్యూ డివిజన్లు కూడా తయారయ్యాయి.. వాటి పరిధిలోని గ్రామాలపై ఒక నివేదిక తయారైపోయింది. ప్రస్తుతం ఖరారైన కొత్త జిల్లాలు , వాటి రెవెన్యూ డివిజన్లు నివేదిక చూడండి..