నీట్ ఎగ్జామ్ ఎంత టెన్షన్ గా ఉంటుందో అందరికీ తెలుసు. దానికోసమే కలలు కంటూ ర్యాంకు కోసం తపిస్తూ ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతుంటారు విద్యార్థులు. అలాంటివారిలో ఒకబ్బాయి సరిగ్గా పరీక్ష రోజే ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడులోని సేలంలో ఈ విషాదం జరిగింది. అతడిపేరు ధనుష్. వయసు 19ఏళ్లు. ఇప్పటికే రెండుసార్లు నీట్ ఎగ్జామ్స్ రాసి ఫెయిలయ్యాడు. మూడోసారి కూడా ప్రిపేర్ అయ్యాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎగ్జామ్ కి సిద్ధమయ్యాడు. అయితే అతను ఇప్పుడు కూడా ఫెయిలవుతామేమోనని భయపడ్డాడు. ఆత్యమహత్య చేసుకున్నాడు.