బాలుడిని లేపుకుపోయిన ముగ్గురు బిడ్డల తల్లి.

    0
    2692

    ఈ మధ్య అక్రమ సంబంధాల వికృతాలు నమ్మశక్యంకాని నిజాలే . ఉచ్చ నీచాలు , వావివరసలు , వయసు తేడాలు మరిచిపోయి అత్యంత హేయంగా ప్రవర్తిస్తున్నారు. ఇందుకు పరాకాష్టే ముగ్గురు పిల్లల తల్లి చేసిన నీచమైన పని. 8వ తరగతి చదివే 15 ఏళ్ళ పిల్లాడితో , ముగ్గురు బిడ్డల తల్లి అక్రమసంబంధం పెట్టుకొని , ఆ పిల్లాడిని లేపుకుపోయింది. ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్ పూర్ కంపియాగంజ్‌కు చెందిన 29 ఏళ్ళ వివాహితకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమెకు సమీపంలోనే ఉండే 15 ఏళ్ల బాలుడితో పరిచయం కలిగింది .తరచూ ఆమె దగ్గరికి వస్తూ ఉండేవాడు. పరిచయం ముదిరి , అక్రమ సంబంధానికి దారితీసింది. ఏడాదిగా గుట్టుగా సాగుతున్న ఈ బాగోతం కాస్తా , ఆమె బాలుడిని లేపుకుపోవడంతో సంచలనమైంది. వారిద్దరి మధ్య ఉన్న వయసు తేడా దృష్ట్యా ఇంతకాలం ఎవరూ అనుమానించలేదు. ఆమె లేపుకుపోయిన బాలుడి కోసం తల్లి తండ్రులు వారం రోజులుగా వెదుకుతున్నారు. చివరకు పోలీసులకు చెప్పి ఫిర్యాదు చేశారు. బాలుడిని లేపుకుపోయిన ఆమెపై కిడ్నాప్ కేసుపెట్టి , గాలిస్తున్నారు.

    ఇవీ చదవండి…

    అమ్మాయిలూ అలాంటి డ్రెస్ వద్దు..

    భర్తను చంపి.. ఇంట్లో పాతి పెట్టి..

    ఆన్ లైన్ కంపెనీకే టోపీ పెట్టాడు..

    ఇదేంటమ్మా . ఇంత పబ్లిక్ గా .మహిళా దినోత్సవ స్పెషలా .? ఇలా ముందుకు పోతున్నామా..??