అక్రమ సంబంధం కోసం ఓ తల్లి 26 ఏళ్ళ కొడుకును చంపేసింది. పంజాబ్ లోని గురుదాస్ పూర్ లో రూపిందర్ జిత్ కౌర్ అనే మహిళకు సుఖవీందర్ సింగ్ తో అక్రమ సంబంధం ఏర్పడింది. కొడుకు రణదీప్ సింగ్ ఈ విషయంలో తల్లిని మందలించాడు. చెడు ప్రవర్తన మానుకోవాలని తల్లికి చెప్పి చూశాడు. అయినా తల్లి వినకుండా తన అక్రమ సంబంధాన్ని కొనసాగించింది. ఈ విషయమై తల్లీకొడుకుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. చివరకు ప్రియుడి కోసం చెట్టంత కొడుకును చంపేందుకు ఈ కర్కశ తల్లి నిర్ణయించుకుంది. వారం క్రితం కొడుకు నిద్ర పోతున్న సమయంలో ప్రియుడిని పిలిపించి ఇద్దరూ కలిసి కొడుకును చంపేశారు. శవాన్ని మురికికాల్వలో పడేశారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు తల్లి అక్రమ సంబంధం, కొడుకు అడ్డు చెబుతున్నాడన్న విషయాన్ని బంధువులు పోలీసులకు చెప్పారు. దీంతో తల్లిని, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇవీ చదవండి..
ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..
కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..
ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..
ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..