అంతర్జాతీయంగా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ హవా నడుస్తోంది. ఎన్నో కంపెనీలు ఈవీ వెహికల్స్ రూపకల్పనలో నిమగ్నమయ్యాయి. ఇక వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ప్రముఖ టెస్లా, లూసిడ్ ఎయిర్ కంపెనీలు ముందువరసలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా మెర్సిడెస్ బెంజ్ కూడా ఈ జాబితాలో చేరింది. అంతేకాదు.. ఎలక్ట్రిక్ వెహికల్స్ లో తిరుగులేదనే పేరున్న టెస్లాను మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రిక్ కారు అధిగమించడం విశేషం.
ఒక్కసారి చార్జ్ చేస్తే 626 మైళ్ళు ప్రయాణించగల సామర్ధ్యం ఈ కారు సొంతం. అంతే 1043 కి.మీ దూరం ప్రయాణించగలదు. 12 గంటలు నాన్ స్టాప్ గా వెళ్ళగలదు. ఎలాంటి రోడ్డులోనైనా సునాయాసంగా సాగిపోతుందీ కారు. టెస్లా ఎలక్ట్రిక్ వెహికల్ ఒక్కసారి చార్జ్ చేస్తే 675 కి.మీ, లూసిడ్ ఎయిర్ కారు 600 కి.మీ మాత్రమే ప్రయాణించగలదు. కానీ మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రిక్ కారు మాత్రం ఒక్కసారి చార్జ్ చేస్తే 1000 కి.మీ పైగా ప్రయాణించగలదని నిరూపితమైంది. అందువల్లే టెస్లా కంటే మెర్సిడెస్ బెంజ్ ఈవీ వెహికల్ బెస్ట్ గా నిపుణులు చెబుతున్నారు. దీని ధర కోటి 20 లక్షల పైమాటే.