రెండేళ్ల ప్రేమకు పెళ్లితో శుభం కార్డు వేద్దామనుకున్న వారిని విధి కాటేసింది.. ప్రియురాలిని మాయదారి రోగం బాలి తీసుకుంది. ప్రియుడు , ఆమె శవానికి తాళికట్టి , ఇక జీవితంలో ఆమెనే భార్యగా భావిస్తానని , ఇంకెప్పుడూ పెళ్లిచేసుకోనని శపధం చేసాడు.. అస్సాంలో జరిగిందీ ఘటన..
బితుపన్ అనే 27 ఏళ్ళ యువకుడు , 24 ఏళ్ళ ప్రార్ధన ప్రేమలో పడ్డారు. పెద్దలకు చెప్పి పెళ్లిచేసుకుందామని అనుకున్నారు. ఇంతలో ఆమె మరణించింది. ఈ విష్యం తెలిసిన బితుపన్ , వాళ్ళ ఊరికొచ్చి , ప్రియురాలికి నివాళులు అర్పించారు.
ఆ యువతి , తల్లి తండ్రుల అనుమతితో , ఆమె మృతదేహాన్ని , సాంప్రదాయబద్దంగా పెళ్లాడాడు. తరువాత , ఆమె శవం మీద ప్రమాణం చేసి , తాను , జీవించి ఉన్నంతవరకు , పెళ్లి చేసుకోననని చెప్పాడు. ఇలాంటి ప్రేమికులు కూడా ఉంటారు .. అందుకే ప్రేమ ఇంకా బ్రతికేవుంది..
ఇవి కూడా చదవండి..