ఆ బ్రిడ్జ్ కి ఓ శాపముందని అంటారు, అమ్మవారి భక్తుల్ని 115మందిని పొట్టనపెట్టుకుంది ఆ బ్రిడ్జ్. అప్పటినుంచి దానికి శాపగ్రస్త బ్రిడ్జ్ గా పేరొచ్చింది. ఆ శాపం ఇప్పుడు తీరిపోయింది. ఆ బ్రిడ్జ్ వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది.
Scary! Bridge connecting Datia to Ratangarh temple washed away, in flood fury following release of water from Manikheda Dam. Same bridge where in 2013 stampede had killed over 115 devotees @ndtvindia @ndtv @GargiRawat @manishndtv @alok_pandey pic.twitter.com/YTWoq0gr6o
— Anurag Dwary (@Anurag_Dwary) August 3, 2021
మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో రత్నాగర్ టెంపుల్ బ్రిడ్జ్ అందరికీ తెలిసిందే. ఇక్కడి దుర్గామాత గుడి చాలా ఫేమస్. ఎనిమిదేళ్ల క్రితం ఈ బ్రిడ్జ్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో 115మంది భక్తులు ఇదే బ్రిడ్జిపై ప్రాణాలొదిలారు.
అలా ఈ బ్రిడ్జ్ వార్తల్లోకెక్కింది. సరిగ్గా ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కూలిపోయింది. వరదల కారణంగా మనిఖేడా డ్యామ్ దగ్గర్లో ఉన్న ఈ బ్రిడ్జ్ ఆ ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఆ సమయంలో ఎవరూ బ్రిడ్జ్ పై లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.