లాంగ్ డ్రైవ్ పేరుతొ యువత చేసే డ్రైవింగ్ యెంత ప్రాణాంతకమో బెంగుళూరు సమీపంలో గతరాత్రి జరిగిన ప్రమాదం నిదర్శనం.. ఈ ప్రమాదంలో చనిపోయిన నలుగురు విద్యార్థులు తెలుగువారే.. గాయపడ్డ మరో ఇద్దరు కూడా తెలుగువారే.. వారి పరిస్థితి కూడా ప్రమాదకరంగా ఉంది.
బెంగుళూరు కృష్ణరాజపురం గార్డెన్ సిటీకి చెందిన ఆరుగురు విద్యార్థులు , వెంకటేష్ , సురేష్ , భరత్ కుమార్ , వైష్ణవి , కృష్ణశ్రీ , అంకిరెడ్డి , బిబిఎ కోర్స్ చేస్తున్నారు. ఈ ఆరుగురు స్నేహితులు లాంగ్ డ్రైవ్ కోసం మంగళవారం రాత్రి ఒక స్విఫ్ట్ కారులో కోలార్ వైపు బయలుదేరారు.
హొస్కోట్ పరిధిలో అత్తూర్ గేటువద్ద , రాత్రి రెండు గంటలసమయంలో వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి , డివైడర్ ని ఢీకొట్టి , జాతీయరహదారిలో గాల్లోకి ఎగిరి , ఇవతలి వైపు రోడ్డుపై పడింది.. కారుని , ఒక లారీ కూడా ఢీకొట్టింది. తర్వాత పల్టీలు కొడుతూ రోడ్డుకు దిగువకు వచ్చేసింది.
కారులో మంటలుకూడా వచ్చాయి.. అందరూ 21- 22 ఏళ్ళ మధ్య వయసులో ఉన్నవారే.. ప్రమాదంలో వెంకటేష్ , సురేష్ , భరత్ కుమార్ , వైష్ణవి చనిపోగా , కృష్ణశ్రీ , అంకిరెడ్డి ,చికిత్సపొందుతున్నారు..