ఇదో కిరాతకురాలు.. చెప్పలేనంత పాపం చేసింది.. మరిది మీద మనసుపడి , చెల్లెలిని , ఆమె ముగ్గురు బిడ్డలను , అన్న కొడుకుని గొంతులు కోసి చంపేసిన నీచురాలు .. కర్ణాటక మాండ్య జిల్లాలో జరిగిన ఈ ఘోరంలో పోలీసులు ఆ నీచురాలిని అరెస్ట్ చేశారు. ఈ నీచురాలిపేరు లక్ష్మి. తన చిన్నమ్మ కూతురు భర్తపై మనసుపడింది. అప్పుడప్పుడు కృష్ణరాజసాగర్ లోని వాళ్ళ ఇంటికొచ్చిపోయేది. మరిదితో అక్రమసంబంధం పెట్టుకుంది.
ఆమెకు కూడా ఇద్దరు పిల్లలు. తనను కూడా పెళ్ళాడమని , భర్తకు విడాకులిస్తానని అడిగేది. అయితే పెళ్ళికి మరిది గంగారాం నిరాకరించాడు. దీంతో భార్య , బిడ్డలుండగా తనను పెళ్లిచేసుకోడని భావించి , అందర్నీ చంపాలని నిర్ణయించుకుంది. అర్ధరాత్రి కత్తితీసుకొని , ఇంటికొచ్చి గంగారాం భార్యని , ముగ్గురుపిల్లలను , మరిక బిడ్డను చంపేసి వెళ్ళిపోయింది.
ఈ దారుణం జరిగినప్పుడు గంగారాం హైదరాబాద్ లో ఉన్నాడు. హత్యలు చేసిన తరువాత , ఇంట్లో నగలు తీసేసుకుంది. ఇదేదో దొంగలు చేసిన పని అని నమ్మించేందుకు ఇళ్ల చేసింది. పోలీసులు సిసి కెమెరాల వీడియోల ఆధారంగా ఆ కిరాతకురాలిని అరెస్ట్ చేసి జై;ఉక్కు పంపారు.