మైనర్ బాలుడి మోజులో పడిన భార్య భర్తను వద్దనుకుంది. అంతవరకు బాగానే ఉంది కానీ.. ఆ బాలుడిని కలిసేందుకు తరచూ పుట్టింటికి వచ్చేది. వద్దని అడ్డు చెప్పినందుకు ఏకంగా భర్తనే మట్టుబెట్టింది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని పోచారంలో జరిగింది ఈ దారుణం.
ఇటీవల భూక్యా మంగీలాల్ అనే వ్యక్తి అనుమానాస్పద రీతిలో మృతి చెందగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్యను తమదైన శైలిలో విచారణ జరగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చిట్టి రామవరం తండాకు చెందిన మాధవి అదే ప్రాంతానికి చెందిన బాలుడితో గతంలో పరిచయం ఉంది. ఆ బాలునితో చనువుగా మాట్లాడేది మాధవి. ఇక ఆ తర్వాత ఇటీవలే మంగీలాల్ తో మాధవి కి పెళ్లి జరిగింది. అప్పుడప్పుడు పుట్టింటికి వచ్చినప్పుడు ఆ బాలుడితో చనువు గా మాట్లాడేది. చివరికి వీరి మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.
అప్పుడప్పుడు ఇక మాధవి సోదరి అయిన చిట్టమ్మ ఇంట్లో ఇద్దరు శారీరకంగా కలుసుకునే వారు. ఇక ఏదో కారణం చెప్పి భర్తను అమాయకున్ని చేసి పుట్టింట్లోనే ఉండేది భార్య. ఇక తరచు కారణాలు చెప్పడం మాధవికి నచ్చలేదు. ఇక తన ప్రియుడితో కలిసేందుకు భర్త అడ్డు వస్తున్నాడు అని భావించింది. ప్రియుడు అతని స్నేహితుడు సోదరి చిట్టెమ్మ తో కలిసి హత్యకు ప్లాన్ చేసింది. ఆ తర్వాత మాధవి ప్రియుడు ఆమె భర్తల మాటల్లో పెట్టి అడవిలోకి తీసుకొని వెళ్లి మద్యం తాగించి ఆ తర్వాత దారుణంగా కొట్టి చంపేశారు. కొన్నాళ్ళకి పోలీసులకు శవం లభ్యమైంది. తమదైన శైలిలో విచారించడంతో భార్య అసలు నిజం ఒప్పుకొంది .
ఇవీ చదవండి..