పాపం, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ పై టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు . కే ఏ పాల్ సిద్దిపేట జిల్లాలో సిరిసిల్లకు పోతుండగా మధ్యలో టిఆర్ఎస్ యువత కార్యకర్తలు , పోలీసులు ఆయన కాన్వాయ్ ని ఆపేసారు . సిరిసిల్ల రైతు ఉద్యమంలో పాల్గొనేందుకు పోతున్నానని , అక్కడ రైతుల సమస్యలు వినాల్సి ఉందని , వారి ఆహ్వానం మేరకే తాను అక్కడికి వెళ్తున్నానని కేపాల్ చెప్పారు .
అయితే జక్కాపూర్ లో పోలీసులు అక్కడి నుంచి కదిలేది లేదని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురికీ వాదోపవాదాలు జరుగుతుండగా సడెన్ గా టిఆర్ఎస్ కార్యకర్త అనిల్ అనే వ్యక్తి కేఏపాల్ చెంప మీద కొట్టాడు . దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. కేఏపాల్ కోడలు జ్యోతి , ఆడ సింహంలా , తన మామ మీద దాడి చేసిన వ్యక్తిని అడ్డుకోవడం చూడండి..
Evangelist – turned – politician KA Paul was attacked in Siddipet district, when he was on the way to Siricilla to visit farmers.
A youth, identified as ruling party worker Anil, slapped Paul in presence of a DSP at Jakkapur.#Telangana pic.twitter.com/njTaNNaJMv— P Pavan (@PavanJourno) May 2, 2022