జిల్లా జడ్జి ప్రాణాలు కోల్పోయింది ప్రమాదంలో కాదు, అది పక్కా ప్లానింగ్ తో చేసిన హత్యేనని రుజువవుతోంది. సీసీ కెమెరాల వీడియోలు బయటకు రావడంతో అసలు నిజం బయటపడింది. ఈ ఘటన జార్ఖండ్ లోని ధన్ బాద్ లో జరిగింది. జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్ నిన్న(బుధవారం) ఉదయం 5 గంటల సమయంలో జాగింగ్ కివెళ్లారు. ఈ సమయంలో వెనకి నుంచి వేగంగా వచ్చిన టెంపో ఆయనను ఢీకొట్టి వెళ్లిపోయింది. టెంపో డ్రైవర్ కావాలనే జడ్జి వైపు వెళ్లి ఢీకొట్టినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఈ హత్యను సీరియస్గా తీసుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.. జార్ఖండ్ హైకోర్టు జడ్జితో మాట్లాడారు.
धनबाद के ज़िला सत्र जज उत्तम आनंद का बुधवार सुबह मोर्निंग वॉक में एक ऑटो के ठक्कर में मौत का मामला गहराता जा रहा हैं @ndtvindia @Anurag_Dwary pic.twitter.com/oV3m3Ca6x0
— manish (@manishndtv) July 28, 2021
బుధవారం ఉదయం ఈ ఘటన జరగగా మొదట దీనినో ప్రమాదంగానే అందరూ భావించారు. హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు. అయితే తాజాగా బయటపడిన సీసీటీవీ ఫుటేజీ ఇది హత్యేనని తేల్చింది. అంతేకాదు ఈ హత్య చేయడానికి కొన్ని గంటల ముందే ఆ వాహనాన్ని దొంగిలించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటికే ఆ డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి నుంచి అర కిలోమీటర్ వెళ్లేలోపే ఉత్తమ్ ఆనంద్ను ఆ వాహనం ఢీకొట్టింది. చాలాసేపటి వరకూ రక్తం మడుగులో ఆయన అలా రోడ్డుమీదే పడి ఉన్న తర్వాత ఓ వ్యక్తి గమనించి హాస్పిటల్కు తీసుకెళ్లగా.. అక్కడ ఆయన మరణించారు.
పోలీసులు గతంలో జడ్జి ఆనంద్ విచారణ జరిపిన కేసులపై దృష్టి సారించారు. ఆయన ధన్ బాద్ లో ఎన్నో మాఫియా హత్యల కేసులను చూస్తున్నారు. ఈ మధ్యే ఇద్దరు గ్యాంగ్స్టర్ లకు బెయిల్ కూడా నిరాకరించారు. దీంతో ఆ గ్యాంగ్ స్టర్లే ఈ హత్యకు పథకం రచించినట్టు అనుమానిస్తున్నారు.
ఇవీ చదవండి..
ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?
అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?