జేఈఈ మెయిన్స్ పరీక్షలను దృష్టిలోపెట్టుకుని మన రాష్టంలో ఇంటర్ పరీక్షలను వాయిదా వేశారు. వచ్చే నెల 8 నుంచి 28 వ తేదీవరకు జరగాల్సిన ఇంటర్ పరీక్షలను వాయిదావేసి , ఏప్రిల్ 22 నుంచి , 28 తేదీవరకు జరపాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. జేఈఈ మెయిన్స్ పరీక్షలు వచ్చే నెల 16 నుంచి 21 తేదీవరకు జరుగనుండటంతో , అనివార్యంగా ఇంటర్ పరీక్షలు వాయిదావేయాల్సి వచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ ప్రకటన చేశారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు మాత్రం ఇదివరకే నిర్ణయించినట్టు మార్చి 11 తేదీనుంచి 31 వరకు జరుగుతాయి..