రెండు రైళ్లు..
ఎదురెదురుగా వస్తే ఏం జరుగుతుంది..?
రెండు రైళ్లు ఎదురెదురుగా వస్తే ఏమవుతుంది..? ప్రమాదం జరుగుతుందని ఇన్నాళ్లూ అనుకునే వాళ్ళం.. అయితే ఇకపై మాత్రం మన దేశంలో, ఇలా ఎదురెదురుగా రైళ్లు వచ్చినప్పటికీ ఏ ప్రమాదం జరుగదు. ఎందుకంటే మన దేశంలోని రైల్వే వ్యవస్థలో కీలక మార్పులు చేశారు. ప్రత్యేకమైన భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశారు. కవచ్ పేరుతో ఓ ప్రత్యేకమైన రక్షణ వ్యవస్థను భారతీయ రైల్వే ప్రవేశపెట్టింది. ఈ నూతన భద్రత వ్యవస్థ కారణంగా రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినప్పటికీ ఏ ప్రమాదం జరుగదు. 380 మీటర్ల దూరంలోనే రైళ్లు నిలిచి పోయేలా ఇందుకోసం ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా రైల్వే లైన్లో మలుపులు, బ్రిడ్జీలు ఉండే ప్రాంతాల్లో కూడా ఆటోమేటిక్ గా రైలు నెమ్మదిగా వెళ్లేలా ఈ భద్రతా వ్యవస్థ ఏర్పాటైంది. రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ స్వయంగా ఈ కవచ్ భద్రత వ్యవస్థను పరిశీలించారు.
Rear-end collision testing is successful.
Kavach automatically stopped the Loco before 380m of other Loco at the front.#BharatKaKavach pic.twitter.com/GNL7DJZL9F— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) March 4, 2022