ఐఏఎస్ వర్సెస్ ఐఏఎస్.. కొప్పుల కోలాటం..

    0
    61

    ఒకరు మైసూరు జిల్లా కలెక్టర్, ఇంకొకరు మైసూరు కార్పొరేషన్ కమిషనర్. ఇద్దరూ ఐఏఎస్ అధికారులే. అయితే కలెక్టర్ రోహిణి సింధూరి, కమిషనర్ శిల్పానాగ్ మధ్య వ్యవహారం పొసగలేదు. విధి నిర్వహణలో పదే పదే తనకు కలెక్టర్ అడ్డొస్తున్నారంటూ ఆరోపిస్తూ శిల్పానాగ్ ఏకంగా రాజీనామా చేయడం ఇక్కడ విశేషం. మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ కలెక్టర్ పై ఆరోపణలు చేశారు కమిషనర్.
    ‘మైసూరులో పనిచేసే వాతావరణం ఏమాత్రం లేదు, అందుకే నేను సివిల్‌ సర్వీసు ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను’అని మైసూరు కార్పొరేషన్‌ కమిషనర్‌ శిల్పా నాగ్‌ ప్రకటించారు.
    ఒక ఐఏఎస్‌ అధికారికి, మరో ఐఏఎస్‌కు మధ్య ఇటువంటి వివాదం సరికాదని, తనను టార్గెట్‌ చేయడంతో ఎంతో బాధపడ్డానని, ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా లేఖ రాశానని ఆమె తెలిపారు. చివరికి ఇక్కడ పనిచేయడం కంటే ఉద్యోగం నుంచి బయటకు రావడం మంచిదని భావించి రాజీనామా చేసినట్లు చెప్పా రు. తాను కలెక్టర్‌కు అన్నివిధాలా గౌరవం ఇ చ్చానని, కానీ తనపై ఆమెకు ఎందుకు పగ, కోపమో అర్థం కావడం లేదని అన్నారు. కాగా, శిల్పా నాగ్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో మైసూరు కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆమె 2014 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. మరోవైపు ఈ విషయమై ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు.

    ఇవీ చదవండి..

    ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

    కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

    ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

    ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..