హైదరాబాద్ మంచిరేవుల ఫాంహౌస్ పేకాట వ్యవహారంలో కీలక మలుపు ఇది. హీరో నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. మంచిరేవుల ఫాంహౌస్ ను శివలింగప్రసాద్ లీజ్కు తీసుకున్నట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు గుత్తా సుమన్తో కలిసి ఫాంహౌస్లో పేకాట ఆడిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. శివలింగప్రసాద్ను అరెస్టు చేసిన పోలీసులు ఉప్పర్ పల్లి కోర్టులో హాజరుపరిచారు. అయితే ఈ కేసులో బెయిల్ కోసం శివలింగ ప్రసాద్ పిటిషన్ దాఖలు చేశారు.
ప్రస్తుతం నాగశౌర్య హీరోగా నటించిన వరుడు కావలెను సినిమా థియేటర్లలో ఉంది. హీరో నాగశౌర్య ఇంతవరకు ఈ వ్యవహారంపై స్పందించలేదు.