అక్రమ సంబంధం వ్యామోహంలో నీచురాలైన ఓ తల్లి తన 15 ఏళ్ళ కొడుకును ఎంత దారుణంగా చంపించింది. సభ్య సమాజం తలదించుకునే విధంగా, మాతృత్వానికే కళంకం తెచ్చే విధంగా ఆ నీచురాలు ఇంతటి ఘాతుకానికి పాల్పడింది. హర్యానాలోని చర్కి , దాద్రి ఈ ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది . తల్లి ఆర్తిదేవి అక్రమ సంబందాన్ని 15 ఏళ్ళ కొడుకు రిషి వ్యతిరేకిస్తుండడంతో ఆమె ప్రియుడు యాసిన్ సహకారంతో ఈ ఘోరానికి పాల్పడింది . రిషి శవాన్ని ఒక రైల్వే అండర్ బ్రిడ్జి కింద పోలీసులు కనుగొన్నారు. గోనె సంచిలో శవాన్ని కుక్కి పెట్రోల్ పోసి తగలబెట్టారు. సగం కాలిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ కేసులో సంచలన నిజాలు బయటికి తెచ్చారు.
తల్లి ఆర్తి దేవి, ఆమె ప్రియుడు యాసీన్ , కొడుకు తమ అక్రమ సంబంధాన్ని వ్యతిరేకించడంతో చంపాలని నిర్ణయించుకున్నారు. అర్ధరాత్రి వేళ , కొడుకు నిద్ర పోతుండగా , యాసిన్ ని పిలిపించి , కొడుకు క్రికెట్ బ్యాట్ తోనే , తలమీద కొట్టి చంపించింది. తరువాత , శవాన్ని గొనె సంచిలో కుక్కి , బయటకు పంపించి. ఊరి బయట , అండర్ బ్రిడ్జి కింద , [పెట్రోల్ పోసి తగబెట్టించారు. ఆ తర్వాత తన కొడుకు కనబడడం లేదని దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉండిపోయింది . పోలీసులు జరిపిన విచారణలో మొబైల్ ఫోన్ వివరాలు అన్నింటినీ స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఈ కేసులో తల్లిని అనుమానించారు. తరువాత అక్రమ సంబంధం విషయం బయటపడింది. తల్లిని, ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపారు..