నా వాచీ ఒకటిన్నర కోటి , ఐదు కోట్లు కాదు..

    0
    4905

    దుబాయ్ లో జరిగిన T -20 మ్యాచ్ లో పాకిస్తాన్ తో ఓడిపోతే పోనీలే అనుకొని , కోట్లు విలువచేసే గడియారాలు తెచ్చుకున్న మన క్రికెట్ ప్లేయర్ హార్దిక్ పాండ్య , తీవ్ర విమర్శలకు గురయ్యాడు.. పాండ్య , దుబాయ్ నుంచి 5 కోట్లు విలువజేసే రెండు గడియారాలు తెచ్చుకున్నాడని , వాటికి కస్టమ్స్ డ్యూటీ కట్టకుండా పోతుంటే , అధికారులు అడ్డుకొని సీజ్ చేశారన్న వార్తలపై , పాండ్య స్పందించారు. తాను తెచ్చుకున్న గడియారం , 5 కోట్లు కాదన్నారు.. అది , ఒకటిన్నర కోటి రూపాయలు విలువజేస్తుందని చెప్పారు.

    ఎయిర్ పోర్టులో దిగిన తరువాత , తాను , దుబాయిలో కొనుగోలుజేసిన గడియారాన్ని సంబందించిన బిల్లులు , కస్టమ్స్ అధికారులకు ఇచ్చానని చెప్పారు. కస్టమ్స్ డ్యూటీ ఎంతైనా , కడతానని చెప్పానని కూడా అన్నారు. తాను కొన్న వాచీ విలువ , ఒకటిన్నర కోట్లు మాత్రమేనని , 5 కోట్లు కాదన్నారు.. తాను చట్టానికి బద్ధుడనై ఉంటానన్నారు..

     

    ఇవీ చదవండి

    పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

    ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు.