కర్నాటకలో జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది చనిపోయారు. గోవా నుంచి హైదరాబాద్కి వస్తున్న బస్సులో మంటలు చెలరేగి.. హైదరాబాద్కి చెందిన 8 మంది ప్రయాణీకులు సజీవ దహనమయ్యారు.
ఆరెంజ్ ట్రావెల్స్ కి చెందిన ఈ స్లీపర్ బస్సు.. కర్నాటకలోని కలబురిగి జిల్లా అమలాపూర్లో మినీ లారీని ఢీ కొట్టింది. ఆ తర్వాత బస్సు గుంటలో పడిపోయింది. వెంటనే బస్సులో మంటలు అంటుకుని 8 మంది చనిపోయారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు, మరో నలుగురు పురుషులు ఉన్నారు.
రెండు కుటుంబాలకు చెందిన 32 మంది గోవా విహారయాత్రకు ఈ బస్సులో వెళ్ళారు. విహారయాత్ర ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.