ఏ నిమిషానికి..
ఏమి జరుగునో.. ఎవరు ఊహించెదరు..?
ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేం.. ఏ క్షణాన ఏం జరగాలో అది జరుగక మానదు.. అన్నీ పై వాడు రాసి పెట్టి ఉంటాడు.. రాసి పెట్టి ఉంటే ఏ ప్రమాదాన్నీ తప్పించుకోలేం.. ఇది కూడా అలాంటిదే.. నిల్చున్న చోటే భూమి కుంగి పోయిందనే మాటలు మనం తరచూ వింటూనే ఉంటాం.. ఇలాంటి ఘటనే రాజస్థాన్ లోని జైసల్మార్ ప్రాంతంలో జరిగింది.
ఓ బైక్ మెకానిక్ షాపు ముందు ఐదుమంది యువకులు మాట్లాడుకుంటున్నారు. మరొకరు పక్కనే బైక్ పెట్టి రిపేర్ చేసుకుంటున్నాడు. అయితే ఒక్కసారిగా వాళ్ళ కాళ్ళ కింద ఉన్న భూమి కంపించిపోయింది. ఉన్నట్టుండి భూమికి రంధ్రం పడి లోపలి జారిపోయారు. అప్పటివరకూ సరదాగా మాట్లాడుకుంటున్న వారంతా ఆ ప్రమాదంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది..