ప్రతిష్టాకరమైన ఐఎన్ ఎస్ యుద్ధనౌకను ముఖ్యమంత్రి జగన్ జాతికి అంకితంచేశారు. ఇందుకు సంబందించిన అధికారపత్రాన్ని ఆవిష్కరించారు. విశాఖపట్నంలో మిలాన్-2022 అంతర్జాతీయ సిటీ పరేడ్ను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి మహత్తర కార్యక్రమానికి విశాఖపట్నం వేదిక కావడం గర్వకారణమని అన్నారు. ఈ పరేడ్ లో 39 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు
. దేశ భద్రతను కాపాడటంలో నావికా దళం పాత్ర అత్యంత ప్రశంసనీయమని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నేవల్ డాక్యార్డ్లో ఐఎన్ఎస్ జలాంతర్గామిని చూసారు..
అధికారులు ఆయనకు సబ్ మెరైన్ పనితీరును వివరించారు. ముఖ్యమంత్రితోపాటు , ఆయన సతీమణి భారతి కూడా వచ్చారు. .
సీఎం కు నావికాదళం గౌరవవందనం తరువాత , పరేడ్ ను పరిశీలించారు. నావికా దళం అధికారులతో ఫొటో దిగారు.