మెగా స్టార్ చిరంజీవి సతీ సమేతంగా శబరిమలై అయ్యప్పస్వామి దర్శనం చేసుకున్నారు. స్వామి సన్నిధానానికి చిరంజీవి , అయన శ్రీమతి డోలీలో చేరుకున్నాడు. ముందుగా డోలీ మోసే కార్మికులకు నమస్కారం చేసుకొని డోలీ ఎక్కారు. వారి శ్రమ జీవన సౌందర్యాన్ని , కష్టాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నారు. తనవల్ల ఇతర భక్తులకు ఇబ్బంది కలగకూడదని డోలీలో సన్నిధానానికి చేరుకున్నానని చెప్పారు..