కారు బీభత్సం- హుస్సేన్‌సాగర్‌లోకి దూసుకెళ్ళింది.

    0
    650

    హైదరాబాద్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళుతూ అదుపు తప్పి హుస్సేన్‌సాగర్‌లోకి దూసుకెళ్ళింది. కారులో ఉన్న ముగ్గురు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఒక యువ‌కుడి చేయి విరిగింది. వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స చేయిస్తున్నారు పోలీసులు. హుసేన్ సాగ‌ర్‌లోంచి కారును బయటకు తీశారు. ఆ కారు ముందు భాగం ధ్వంస‌మైంది. ప్ర‌మాదానికి గురైన వారు ఖైర‌తాబాద్ ప్రాంతానికి చెందిన నితిన్, సాత్విక్, కార్తీక్‌గా పోలీసులు గుర్తించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

     

     

    ఇవీ చదవండి

    పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

    ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు.