పెళ్లికిముందే బ్రెయిన్ డెడ్.. అవయవాలు దానం..

    0
    401

    విధి చాలా కర్కశమైనది..కొద్దీ గంటల్లో పెళ్లిపీటలమీదకు చేరాల్సిన నవ వధువుని కాటికి చేర్చింది. వింటేనే కన్నీరు తెప్పించే ఈ దారుణం చూసిన వారి గుండె యెంత తరుక్కుపోతుందో ఊహించండి.. కర్ణాటకలోని కోలార్ జిల్లా కోడిచెరువు గ్రామంలో పెళ్ళికి ముందు జరిగే రెసెప్షన్లో చైత్ర అనే పెళ్లికూతురు సడెన్ గా పడిపోయింది. పక్కనే పెళ్ళికొడుకు కూర్చుని ఉండగా , స్నేహితులు , బంధువులు అబినందనలు అందుకుంటూ , అక్షింతలు వేయించుకుంటూ , సంతోషంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఉన్న పళంగా పడిపోయింది. అలసిపోయిందేమో అనుకున్నారు. కానీ ఎంతకీ స్పృహలోకి రాకపోవడంతో , కొద్దీ గంటల్లో జరగాల్సిన పెళ్లి వాయిదావేసి బెంగుళూరులోని హాస్పిటల్ కి తీసుకుపోయారు.ఐదు రోజులు కోమాలోనే ఉంది . ఛైత్రకు బ్రెయిన్ డెడ్ అయిందని , బ్రతికే అవకాశంలేదని డాక్టర్లు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు , ఆమె చనిపోయినా , ఆమె స్మృతులు సజీవంగానే ఉండాలని భావించారు. దీంతో , చైత్ర అవయవాలను దానం చేశారు.. చైత్ర భౌతినకాయానికి శనివారం అంత్యక్రియలు నిర్వహించారు.

     

    ఇవీ చదవండి… 

    టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

    సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

    పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

    కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..