విధి చాలా కర్కశమైనది..కొద్దీ గంటల్లో పెళ్లిపీటలమీదకు చేరాల్సిన నవ వధువుని కాటికి చేర్చింది. వింటేనే కన్నీరు తెప్పించే ఈ దారుణం చూసిన వారి గుండె యెంత తరుక్కుపోతుందో ఊహించండి.. కర్ణాటకలోని కోలార్ జిల్లా కోడిచెరువు గ్రామంలో పెళ్ళికి ముందు జరిగే రెసెప్షన్లో చైత్ర అనే పెళ్లికూతురు సడెన్ గా పడిపోయింది. పక్కనే పెళ్ళికొడుకు కూర్చుని ఉండగా , స్నేహితులు , బంధువులు అబినందనలు అందుకుంటూ , అక్షింతలు వేయించుకుంటూ , సంతోషంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఉన్న పళంగా పడిపోయింది. అలసిపోయిందేమో అనుకున్నారు. కానీ ఎంతకీ స్పృహలోకి రాకపోవడంతో , కొద్దీ గంటల్లో జరగాల్సిన పెళ్లి వాయిదావేసి బెంగుళూరులోని హాస్పిటల్ కి తీసుకుపోయారు.ఐదు రోజులు కోమాలోనే ఉంది . ఛైత్రకు బ్రెయిన్ డెడ్ అయిందని , బ్రతికే అవకాశంలేదని డాక్టర్లు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు , ఆమె చనిపోయినా , ఆమె స్మృతులు సజీవంగానే ఉండాలని భావించారు. దీంతో , చైత్ర అవయవాలను దానం చేశారు.. చైత్ర భౌతినకాయానికి శనివారం అంత్యక్రియలు నిర్వహించారు.